Politics

విందు రాజకీయంలో వారసత్వ కంపు

TDP Lokesh Party To Bring Brahmani Into LimeLight

టీడీపీలో విందు రాజకీయం ఆసక్తిగా మారింది. టీడీపీ నేతల రాజకీయ వారసులతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు హైదరాబాద్‌లో విందు సమావేశం నిర్వహించారు. ఈ విందుకు టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన వారసులు పాల్గొన్నారు. వారసుల భార్యాభర్తలకు ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కీలక భేటికి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిలు హాజరయ్యారు. పేరుకే విందు అయినా రాజకీయ పరిణామాలపై చర్చించారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణతో పాటూ పార్టీ బలోపేతంపై చర్చించారట. ముఖ్యంగా పార్టీలో కీలకమైన యువ నేతలు కాబట్టి.. వారిని ఇప్పటి నుంచే కాస్త జోష్ పెంచే దిశగా ఈ విందు ఏర్పాటు చేశారట. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరిపారట. ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, పరిటాల శ్రీరామ్, టీజీ భరత్, మాగంటి రాంజీ దంపతులు, జ్యోతుల నవీన్, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు కుమారులు, కోడళ్లు ఇలా యువ నేతలు ఈ విందుకు వచ్చారు