Politics

అశోక్‌గజపతిని తొలగిస్తూ జగన్ సర్కార్ జీవో

YS Jagan Removes Ashok Gajapati From That Post

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మాన్సస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజును తొలగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్‌చైర్మన్‌గా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న సింహాచలం ఆలయ చైర్మన్‌గా సంచిత ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. సంచిత గజపతిరాజు బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మాన్సస్‌ ట్రస్ట్‌కు 108 ఆలయాలు, 14,800 ఎకరాల భూములు ఉన్నాయి.