Politics

జగన్ కేసు వాయిదా

CBI Court Adjourns YS Jagan's Case

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసు విచారణను సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా జగన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన ఆబ్సంట్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను ఈనెల 13కు కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి రాజగోపాల్, శ్రీలక్ష్మి ఈరోజు కోర్టుకు హాజరయ్యారు.