Politics

కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ప్రశంసలు

Governor Tamilisai Full Speech In Telangana Assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదటి రోజున గవర్నర్ తమిళ సై ప్రసంగించారు.

60 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడిందని గవర్నర్ తెలిపారు. ‘ఉద్యమ నేత తెలంగాణ సీఎంగా ఉన్నారు.

కేసీఆర్‌ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకుపోతోంది. అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధిస్తోంది.

తక్కువ సమయంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. కరెంట్‌, నీటి సమస్యను తెలంగాణ అధిగమించింది.

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెరువులను నిర్లక్ష్యం చేశారు. విద్య, వైద్యం, తాగు, సాగునీటిని నిర్లక్ష్యం చేశారు’ అని తమిళిసై తెలిపారు.

త్వరలోనే పెన్షనర్ల వయస్సు తగ్గిస్తాం!

‘తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను నివారించాం. వృద్ధులు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం.

వృద్ధులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 పెన్షన్‌ ఇస్తున్నాం. ఒంటరి మహిళలకు సైతం పెన్షన్లు ఇస్తున్నాం.

త్వరలోనే పెన్షనర్ల వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తాం. ఉన్నత ప్రమాణాలతో రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశాం. 950 రెసిడెన్షియల్‌ స్కూళ్లను నడిపిస్తున్నాం.

కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, రూ.1కే కిలో బియ్యం ఇస్తున్నాం’ అని గవర్నర్ నిశితంగా వివరించారు.

24 గంటల విద్యుత్..

‘చెరువులు, రిజర్వాయర్లపై మత్స్యకారులకు హక్కులు కల్పించాం. నాయీ బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం.

యాదవులు, నేత కార్మికులను ఆదుకుంటున్నాం.

125 చదరపు గజాల లోపు ఇళ్లను క్రమబద్ధీకరిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఓవర్‌సీస్‌ స్కాలర్‌ షిప్‌లు ఇస్తున్నాం.

హోంగార్డులు, అంగన్‌వాడీల జీతాలు పెంచాం. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాం.

సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉంది. విద్యుత్‌ తలసరి వినియోగంలో దేశంలోనే ముందున్నాం.

వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. అన్నిరంగాలకు 24గంటల విద్యుత్‌ ఇస్తున్నాం’ అని గవర్నర్‌ తమిళిసై తెలిపారు.

త్వరలోనే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి!

‘కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డిని వేగంగా పూర్తి చేస్తున్నాం. కాళేశ్వరం ప్రపంచంలోనే ఎత్తయిన ఎత్తిపోతల పథకం. సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేస్తాం.

కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రైతుబంధు కింద రూ.10వేలు ఇస్తున్నాం. రైతుబీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నాం. మిషన్‌ భగీరథతో మంచినీటి సమస్యను పరిష్కరించాం.

అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం. హైదరాబాద్‌లోని అన్ని డివిజన్లలో బస్తీ దవాఖానాలు.

కంటి వెలుగు తరహాలో చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు నిర్వహించాం’ అని గవర్నర్ వివరించారు.

భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం!

‘పరిపాలనలో భాగంగా భారీగా సంస్కరణలు తీసుకొచ్చాం. కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తీసుకొచ్చాం.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తుంది.

ఎస్‌ ఐపాస్‌ విధానంతో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను వేగంగా నిర్మిస్తున్నాం.

రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయి. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 66శాతం తెలంగాణలో ఉన్నాయి.

మత సామరస్యానికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల మధ్య ఐకమత్యం పెంపొందేలా లౌకిక స్ఫూర్తిని కాపాడేలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం’ అని గవర్నర్ తెలిపారు.

మన రాష్ట్రంలో ఆ దుస్థితి లేదు..!

‘ఆర్థికమాంద్యం ప్రభావం తెలంగాణపై కూడా పడింది. అన్ని రాష్ట్రాల్లో వృద్ధి రేటు తిరోగమనంలో ఉంది. మన రాష్ట్రంలో ఆ దుస్థితి లేదు.

ఆకలి దప్పులు లేని… అనారోగ్యాలు లేని శతృత్వంలేని రాజ్యమే గొప్ప రాజ్యం’ అని అసెంబ్లీలో గవర్నర్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాలను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

కాగా… ఆదివారం నాడు ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
####################
రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని, దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 66శాతం తెలంగాణలో ఉన్నాయని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ ఆర్థికమాంద్యం ప్రభావం తెలంగాణపై కూడా పడిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో వృద్ధి రేటు తిరోగమనంలో ఉందని, అయతే తెలంగాణ రాష్ట్రంలో ఆ దుస్థితి లేదని గవర్నర్‌ అన్నారు. ఆకలి దప్పులు లేని… అనారోగ్యాలు లేని.. శతృత్వంలేని రాజ్యమే గొప్ప రాజ్యమని తమిళిసై వ్యాఖ్యానించారు.కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వేగంగా పూర్తి చేస్తున్నామని గవర్నర్ తమిళిసై చెప్పారు. కాళేశ్వరం ప్రపంచంలోనే ఎత్తయిన ఎత్తిపోతల పథకమని, సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె చెప్పారు. రైతుబంధు కింద రూ.10 వేలు ఇస్తున్నామని, రైతుబీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు. మిషన్‌ భగీరథతో మంచినీటి సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని అన్ని డివిజన్లలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని, కంటి వెలుగు తరహాలో చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిపాలనలో భాగంగా భారీగా సంస్కరణలు తీసుకొచ్చామని గవర్నర్ తమిళిసై చెప్పారు. కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తీసుకొచ్చామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయని, కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తోందని చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ విధానంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్. కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తోందని చెప్పారు. టీఎస్‌ ఐపాస్‌ విధానంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను వేగంగా నిర్మిస్తున్నామని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.