Fashion

ఇంటర్‌సిటీలో మహిళలే ఉద్యోగులు

Women Crew In Vijayawada Railway Zone

విజయవాడ నుంచి మొత్తం మహిళా సిబ్బందితో ఉమెన్‌ క్రూ రైలు నడపటానికి విజయవాడ రైల్వే డివిజన్‌ అడుగులు వేస్తోంది. విజయవాడ-గూడూరు మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ విధానాన్ని త్వరలో అమలు చేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో విజయవాడ రైల్వే డివిజన్‌ ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఇంటర్‌సిటీలో పైలెట్‌ దగ్గర నుంచి టీటీ, గార్డు, స్వీపింగ్‌ వరకూ అంతా మహిళలే పనిచేస్తారు. దీనికోసం మహిళా క్రూను ప్రత్యేకంగా కేటాయించాలని విజయవాడ డీఆర్‌ఎం పి.శ్రీనివాస్‌ నిర్ణయించారు. దీనికోసం శుక్రవారం తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో మహిళల క్రూతో కొంతదూరం నడిపించటానికి ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. విజయవాడ నుంచి బిట్రగుంట వరకు అసిస్టెంట్‌ లోకో పైలెట్‌, గార్డు, టీటీ, ఆర్పీఎఫ్‌, స్వీపర్‌లు మహిళా ఉద్యోగులే ఉంటారు. పూర్తిగా మహిళలే నిర్వహించే ఈ రైలులో ఎవరైనా ఎక్కవచ్చు…