Politics

రూ.1,82,914 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

Harish Rao Presents Telangana Budget In Assembly

2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని వివంచారు. బడ్జెట్‌ అంటే కేవలం కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదని స్పష్టం చేశారు. ‘‘ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమనేత కేసీఆర్‌. కేసీఆర్‌ దార్శనికతతో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా కొనసాగుతోంది. కేసీఆర్‌ సమగ్ర దృష్టి, శ్రద్ధాశక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్‌. అని వెల్లడించారు.
బడ్జెట్‌ సమగ్ర స్వరూపం

* రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు

* పెట్టుబడి వ్యయం రూ.22,061.18

* రెవెన్యూ మిగులు రూ.4,482.18 కోట్లు

* ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లు