NRI-NRT

ఒమన్ ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

Oman Telugu NRI NRT News - OMan NRI TRS Conducts Cricket Tournament 2020

ఒమాన్ లో అట్టహాసంగా తెలంగాణ క్రికెట్ టోర్నమెంట్ ….మస్కట్ : మార్చి 6 శుక్రవారం నాడు ఒమాన్ దేశం మస్కట్ లో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఒమాన్ మరియు తెలంగాణ జాగృతి ఒమాన్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకించి అక్కడి తెలంగాణ వాసుల కోసం అట్టహాసంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ముందుగా ఇటీవల స్వర్గస్థులు అయిన అక్కడి మహారాజు శ్రీ సుల్తాన్ కాబూస్ గారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం పది జట్లు పాల్గొన్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాయ వాటర్ కంపెనీ సీఈఓ శ్రీ హుస్సేన్ హస్సన్ అలీ అబ్దుల్ హుస్సేన్ గారు మరియు విశేష అతిథిగా ఇండియన్ సోషల్ క్లబ్ స్పోర్ట్స్ సెక్రటరీ హైద్రబాద్ వాసి శ్రీ సోహైల్ ఖాన్ గారు పాల్గొన్నారు.
ఈ పోటీలో డెకాన్ ఛాంపియన్స్ జట్టు విజేతగా మరియు తెలంగాణ వారియర్స్ రన్నర్స్ గా నిలిచాయి.ఈ సందర్భంగా టీఆరెస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షులు మహిపల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒమాన్ లో వివిధ ప్రాంతాల్లో నివసించే తెలంగాణ వాసులను ఒకే చోట ఐక్యం చేసునందుకు ఏట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తునము అని తెలిపారు.ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు సహకీరించిన స్పాన్సర్లు,నిర్వాహక సబ్యులకు మరియు అన్ని జట్ల సబ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆరెస్ ఒమాన్ శాఖ కోర్ కమిటీ సభ్యులు షేక్ అహ్మద్,సత్యనారాయణ బిళ్ళ,కరుణాకర్,ప్రవీణ్ కుమార్,రాజేందర్ రెడ్డి, రవి నూనే,సాయి కుమార్ చౌదరి,రాజేందర్,బల్ల ఆంజనేయులు అనిల్,ఇమామ్,బల్ల శ్రీనివాస్,వినోద్,తిరుపతి యాదవ్,రాజ్ కుమార్ రెడ్డి,అజయ్ అక్కినపల్లి,జగదీశ్,వీరేందర్, లక్ష్మణ్,అజయ్, కిరణ్ ప్రభ,రాజు పుప్పాల,సుధీర్ రెడ్డి,రఘు,రాజు, మధు,నవీన్,పది జట్ల సభ్యులు మరియు తెలంగాణ జాగృతి ఒమాన్ శాఖ అధ్యక్షులు గుండు రాజేందర్ గారు పాల్గొన్నారు.