‘బాహుబలి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రభాస్. అతడితో నటించేందుకు బాలీవుడ్ అగ్ర తారలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ చిత్రం తెరకెక్కబోతున్నది. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా కత్రినాకైఫ్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నాయికను హీరోయిన్ తీసుకోవాలని భావించిన చిత్రబృందం కత్రినాకైఫ్ పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు చెబుతున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. ఇదివరకు తెలుగులో ‘అల్లరి పిడుగు’, ‘మల్లీశ్వరి’ చిత్రాల్లో నటించింది కత్రినా.
ప్రభాస్కు కైఫు
Related tags :