Business

₹1000కోట్లు విరాళమిచ్చిన టాటా

TATA Sons Donate 1000 Crores To COVID19 Fight

కరోనా మహమ్మారిపై సమరానికి టాటా సన్స్‌ రూ.1000 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ మధ్యాహ్నమే టాటా ట్రస్ట్‌ తరఫున రూ.500 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా టాటా గ్రూప్‌ తరఫున కరోనాపై పోరాటానికి విరాళం రూ.1500 కోట్లకు చేరింది. ప్రస్తుతం భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అత్యవసర చర్యలు అవసరమని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా అన్నారు.