Food

వాము ఆకు బజ్జీలు అదరహో

Ajwain Leaves Bajji - Telugu Food And Diet News

వామాకుతో బజ్జీలు మాత్రమే చేసుకుంటారని అనుకుంటారు చాలామంది. నిజానికి… సాధారణ జలుబు నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. వామాకుతో చేసే రసం, పెరుగు పచ్చడి రుచితోపాటు అనేక పోషకాలనీ అందిస్తాయి…
* కొత్త ఆకులను తెంపి వాడుకోవచ్ఛు అలా మొక్కలను పెంచుతూనే ఆకులను నెలల తరబడి వాడుకోవచ్చు.
* వాము ఆకుల నుంచి వచ్చే సువాసనతో ఇంటి పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారతాయి. దీన్ని మిగతా ఆకు కూరల మాదిరిగానే అన్ని వంటకాల్లో వాడుకోవచ్చు.
****ప్రతి ఇంట్లో పోపుల పెట్టెలో ఉండే సుగంధ ద్రవ్యం వాము. దీని పుట్టినిల్లు భారతదేశం. రుచికి, శుచికి, ఆరోగ్యానికి వాము పెట్టింది పేరు. ఈ మొక్కలోని అన్ని భాగాలకు ఘాటైన వాసన ఉండటం వల్ల సంస్కృతంలో దీన్ని ‘ఉగ్రగంధ’ అంటారు. వాములో పీచు, ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని పచ్చిగా, వేయించి కూడా వాడుకోవచ్ఛు నీటిలో కలుపుకొని తాగొచ్ఛు తేనీటిలో వేసుకొని తాగొచ్ఛు జలుబు, జీర్ణ సంబంధ సమస్యలు ఇట్టే దూరమవుతాయి. వాము మొక్కలను పెరట్లో లేదా తొట్టెల్లో పెంచుకుని తాజా ఆకులను వివిధ వంటకాల్లో వాడుకోవచ్చు.
***ఉపయోగాలివి.
* వాము ఆకులను నీటిలో ఉడికించి తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఈ ఆకులతో చేసిన పకోడీలు తినడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. పచ్చళ్లు, చట్నీలలో రుచి కోసం వాడతారు. రంగు, రుచి కోసం పండ్ల రసాలు, పానీయాల్లో కూడా వాడుతుంటారు. పొట్టలో సమస్యలను తగ్గించడానికి వాము, ఆకు ఉపయోగపడతాయి. ఇది ఆకలిని పెంచుతుంది. వాములో ఉండే థైమోల్‌ అనే రసాయనం శిలీంధ్రాలు, సూక్షజీవులపై పనిచేస్తుంది. నీళ్లలో కాస్త వాము వేసుకుని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. కొవ్వును కరిగించి, బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. వెంట్రుకలు తెల్లబడకుండా చేసే శక్తి వాముకుంది.
* గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసరైడ్‌ స్థాయులను తగ్గిస్తుంది. రక్తపోటును, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
* వాములో కాస్త ఆవనూనె వేసి ఇంట్లో ఒక మూలన ఉంచితే దోమలు దరిచేరవు. వాములో ఉండే యాంటీ బయోటిక్‌, అనస్తిటిక్‌ విలువల వల్ల కాళ్ల నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతుంది. పొట్టలో ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. అందుకే చిన్న పిల్లలకు గ్యాస్‌, అజీర్తి తగ్గించే సిరప్‌లలో వాము నీటిని ఎక్కువగా వాడతారు.
****ఎలా పెంచాలంటే?
వామును విత్తనాల ద్వారా పెంచుకోవచ్ఛు కంపోస్టు, కొబ్బరి పీచు మిశ్రమాన్ని ట్రేలో గానీ, సిమెంట్‌ తొట్టెలో గానీ నింపి అందులో పైపైన వాము గింజలు చల్లాలి. ఆ తర్వాత పైన పల్చగా మట్టిని వేయాలి. నీడ ప్రదేశంలో ఉంచి ఉదయం, సాయంత్రం నీటిని తుంపరలుగా చల్లాలి. వారం నుంచి రెండు వారాల్లో మొలకెత్తుతాయి. సూర్యరశ్మి ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా ఎండపడే ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలి. ఆకులు ఎండిపోతే తెంపి పారేయాలి. పురుగులు పడితే వేపనూనె పిచికారీ చేయాలి. తొట్టిలోని మట్టి తడారకుండా చూసుకోవాలి.