రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆక్వా వ్యాపారులు, రాయలసీమకు చెందిన ఉద్యాన పంట రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఆక్వా వ్యాపారులతోపాటు, ఉద్యాన పంట రైతులు సైతం ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆక్వా మేత, ఐస్ కొరత, మార్కెటింగ్ సదుపాయం లేక ఆక్వా రంగం కుదేలయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చీనీ, బొప్పాయ లాంటి ఉద్యాన పంటలకు మార్కెటింగ్ లేక రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా ఈ రెండు రంగాలతో పాటు వీటితో అనుసంధానమైన ఎంతో మంది నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆక్వా, ఉద్యాన రంగాలను ఆదుకునేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని కన్నా సీఎంకు విజ్ఞప్తి చేశారు.
కరోనా వలన ఆక్వాకు గట్టిదెబ్బ
Related tags :