Movies

బెహ్రెయిన్‌లో ఉన్న శ్రీలంకన్ తల్లిదండ్రులు

Jacqueline Fernandez Worries About Her Parents

కరోనావైరస్‌ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో తన తల్లిదండ్రుల గురించి ఎంతో ఆందోళనకు గురి అవుతున్నానని బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ తెలిపారు. శ్రీలంకకు చెందిన ఆమె సినిమాల్లో నటించాలనే ఉద్దేశంలో ముంబయికి వచ్చి ఇక్కడే స్థిరపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జాక్వెలిన్‌ ముంబయిలో ఉండగా.. ఆమె తల్లిదండ్రులు బహ్రెయిన్‌లో ఉంటున్నారు. కొవిడ్‌-19 రోజురోజూకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో విదేశీ ప్రయాణాలను వివిధ దేశాలు అనుమతించడంలేదు. దీంతో జాక్వెలిన్‌ తన తల్లిదండ్రులను కలుసుకోలేక వారి ఆరోగ్యం గురించి ఆందోళనకు గురవుతున్నానని ఆమె ఓ ఆంగ్ల పత్రికతో తెలియజేశారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు నాతో ఉంటే బాగుండేదనిపిస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను కానీ.. వాళ్లు ఎలా ఉన్నారో, వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందో అని ఆందోళన చెందుతున్నాను. ఇంకో విషయం ఏమిటంటే.. నేను ఇక్కడ ఒక్కదానినే ఉన్నానని వాళ్లు కూడా నా గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులతో కలిసి ఉన్నా వారందరూ ఎంతో అదృష్టవంతులు. పెద్దవాళ్లకు ఇప్పుడు మన ప్రేమాభిమానాలు ఎంతో అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకి మనం తోడుగా ఉండాలి.’ అని జాక్వెలిన్‌ తెలిపారు.