బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ప్రతి రోజు పది వేల మందికి భోజన సదుపాయం కల్పించేలా కోల్కతాలోని ఇస్కాన్కు విరాళాన్ని అందించాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో పేదలు ఇబ్బంది పడకూడదని సాయం చేస్తున్నాడు. ‘‘కోల్కతాలోని ఇస్కాన్ కేంద్రం ప్రతి రోజు పది వేల మందికి భోజనం అందిస్తుంది. సౌరవ్ గంగూలీ ముందుకు వచ్చి మాకు మద్దతుగా నిలిచి విరాళాన్ని అందించారు. దీంతో మేం రోజూ ఇక 20వేల మందికి ఆహారాన్ని అందిస్తాం’’ అని కోల్కతాలోని ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తెలిపారు.
రోజుకి 10వేల మందికి అన్నదానం
Related tags :