NRI-NRT

Flash…Flash…అమెరికాలో తెలుగు వైద్యులు మృతి

Flash...Flash...కొరోనాతో అమెరికాలో ఇద్దరు తెలుగు వైద్యులు మృతి-Two Telugu NRI Doctors DIe Due To CoronaVirus In USA-Yerubandi Satyavarthan Rao Telugu Doctor Died In USA - Abu Azhar Telugu Doctor Dies In USA.

అమెరికాలో తెలుగువారు కొరోనా వైరస్ నుండి సురక్షితంగా ఉన్నారనే వార్తలకు తెరపడింది. కొరోనా బారినపడి దానితో పోరాడుతూ ఇరువురు ప్రవాస తెలుగు వైద్యులు అసువులు బాశారు.

*** విశాఖపట్నం నుండి….
సోమవారం నాడు అలబామా రాష్ట్రంలోని హంట్స్‌విల్‌లో సర్జన్‌గా పనిచేస్తున్న డా.ఎరుబండి సత్యవర్థనరావు(73) టెన్నిస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్‌లో గల వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో Pneumoniaతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో వైద్య విద్యనభ్యసించిన డా.రావు గత 50ఏళ్లుగా అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆయన మృతికి ప్రవాస వైద్య ప్రముఖులు డా.నల్లూరి ప్రసాద్‌తో పాటు పలువురు ప్రవాస తెలుగు ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

*** కాకతీయ పూర్వ విద్యార్థి…
డా. అబు అజ్హర్(75) వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో వైద్య విద్యనభ్యసించారు. ఈయన  కొరోనాతో పోరాడుతూ కెనడాలో మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఇరువురు వైద్యుల మృతి పట్ల అమెరికాలో ప్రవాస తెలుగు వైద్యులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

First Published – April 4th 2020

Updated – April 06 2020