Agriculture

రైతులను మోసం చేస్తే ఖబడ్దార్

YS Jagan Warns Fraudsters Who Is Cheating Aqua Farmers

ఆక్వా రైతులను మోసగించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. ఆక్వా ఉత్పత్తుల్లో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టాలని కోరారు. సీఎం జగన్‌తో సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి ఎగుమతి సంస్థ (ఎంపెడా) ఛైర్మన్‌ శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. కరోనా దృష్ట్యా ఆక్వా రైతులు, ఉత్పత్తుల రావాణాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని ఎంపెడా ఛైర్మన్‌కు సీఎం సూచించారు. ప్రభుత్వ నిర్దేశిత ధరలకు ఎగుమతిదారులు కొనుగోలు చేసేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ఎగుమతి దారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపెడా ఛైర్మన్‌ సీఎంకు వివరించారు. తక్కువ ధరలకు కొంటే చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.