Politics

కేసీఆర్…ఇవి నా డిమాండ్స్

Revanth Reddy Demands KCR In A Letter

జిల్లాల్లో తీవ్ర పంటనష్టం జరిగింది.

• ఈదురు గాలులు, వడగళ్ల వర్షంతో ఏప్రిల్ 24న కుమురం భీం, భవనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది.

• రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో వేల ఎకరాల వరిపంట, 613 ఎకరాల్లో మామిడికి నష్టం జరిగింది.

• మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రంలో 1500 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. 150 ఎకరాల్లో మామిడికి నష్టం జరిగింది.

• సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ యార్డులో రెండు వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. జొన్న, ఉల్లి, తెల్ల కుసుమ పంట దెబ్బతిన్నది.

• కామారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అకాల వర్షాల సమయంలో పొలం పనుల్లో ఉన్న ఐదుగురు రైతులు పిడుగు పాటుకు గురై మృత్యువాత పడ్డారు.

• కొనుగోలు కేంద్రాల్లో రైతులను దగా చేస్తున్న సంఘటనలు కోకొల్లలు.

తాలు, తేమ, తరుగు పేరుతో రైతులను వ్యాపారులు నిలువునా దోచేస్తున్నారు. దీంతో అనేక చోట్ల రైతులు నిరసనలకు దిగుతున్నారు.

• రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ల పల్లి మండలం, లక్ష్మీపూర్ ఐకేపీ కేంద్రంలో ధన్యానికి రైతులు నిప్పు పెట్టి నిరసనకు దిగారు.

పెద్దపల్లి జిల్లా, మంథని మండలం, ఎగ్లాస్ పూర్ లో క్వింటాల్ కు రెండున్నర కేజీలు అధికంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టి నిరస వ్యక్తం చేశారు.

జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండలం, త్యాగలమర్రి కొనుగోలు కేంద్రంలో పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన తెలిపారు.

కరీంనగర్ జిల్లా పోరండ్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో తరుగు పేరుతో దోపిడీని నిరసిస్తూ రైతులు ధర్నాలు చేశారు.

చొప్పదండిలో ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు ఉన్నాయి.

• నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో 1.30 లక్షల ఎకరాల్లో పసుపు పంట పండింది.

లాక్ డౌన్ కంటే ముందు క్విటాల్ పసుపు ఏడు వేలకు కొన్న వ్యాపారులు ఇప్పుడు 4,500 కు మించి కొనబోమంటున్నారు.

పొరుగున మహా రాష్ట్రలో క్వింటాల్ రూ.7,500 పలుకుతోంది.

• లాక్ డౌన్ పేరుతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన జిన్నింగ్ మిల్లులను మూసి వేశారు.

దీంతో పత్తి కొనుగోలు నిలిచిపోయింది. పత్తిని ఇళ్లలో నిల్వ చేసుకోలేక, అమ్ముకునే అవకాశం లేక రైతులు సతమతం అవుతున్నారు.

మహారాష్ట్ర, గుజరాత్ లలో జిన్నింగ్ మిల్లులను వ్యవసాయం అనుబంధ పరిశ్రమలుగా గుర్తించి లాకౌ డౌన్ లో కూడా నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చారు. మీరు ఆ వైపుగా కనీస శ్రద్ధ కనబరచడం లేదు.

డిమాండ్స్…

1. అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన ప్రాంతాలకు తక్షణం అధికార బృందాన్ని పంపి పంట నష్టం అంచనా వేయించాలి. నష్ట పరిహారం చెల్లించాలి.

2. టీఆర్ఎస్ ఎన్నికల హామీ అయిన రూ.లక్ష రుణమాఫీ తక్షణం అమలు చేయాలి.

3. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా తరుగు, తేమ పేరుతో రైతులను దోపిడీ చేస్తోన్న వ్యాపారుల పై క్రిమినల్ కేసులు పెట్టాలి.

4. పిడుగుపాటుతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి.

5. మిర్చీ, పత్తి, పసుపు ఇతర వాణిజ్య పంటల కొనుగోలు, మద్ధతు ధరపై తక్షణం కార్యచరణ తీసుకోవాలి.

6. మామిడి, బత్తాయి, ఇతర ఫలాల రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యచరణ తీసుకోవాలి.

7. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన రైతుల ధాన్యాన్ని మద్ధతు ధరకే కొనుగోలు చేయాలి.

8. ధాన్యంలో తేమ లేకుండా, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్న నిబంధనను సడలించాలి.

తక్షణం ఈ డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకోని పక్షంలో ప్రత్యక్ష కార్యచరణకు దిగాల్సి వస్తుంది.
ఎ. రేవంత్ రెడ్డి,