NRI-NRT

శశికాంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐఐటీలో ఉచిత శిక్షణ

Sasikanth Foundation Opens AI Boosted Learning Platform

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ Q-Hub నిర్వాహకుడు వల్లేపల్లి శశికాంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు IIT-JEE, NTSE, NEET తదితర పరీక్షలకు అవసరమైన తర్ఫీదును అంతర్జాలం ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధీంచిన వెబ్‌సైట్ www.LearningTree.aiను తెలంగాణా ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం నాడు ప్రారంభించారు. కృత్రిమ మేథ సహకారంతో సాగే ఈ ఆన్‌లైన్ శిక్షణలో నూతన పద్ధతులను పొందుపరిచారు. వీటి ద్వారా విద్యార్థులు సులువుగా, సమర్థంగా పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా బోధనను రూపొందించినట్లు శశికాంత్ తెలిపారు.
Sasikanth Foundation Opens AI Boosted Learning Platform-Vallepalli Sasikanth