అర్జున, రాజీవ్ ఖేల్రత్నతోపాటు వివిధ జాతీయ క్రీడా అవార్డుల కోసం నామినేషన్లను మెయిల్ ద్వారా పంపాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రతి ఏడాది సాధారణంగా ఏప్రిల్ నెలలో ఈ ప్రక్రియ ప్రారంభించేవారు. అయితే, ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అవార్డుల ఎంపిక ప్రక్రియ కాస్తా ఆలస్యమైంది. ‘కొవిడ్-19 వ్యాప్తి నివారణకు చేపట్టిన లాక్డౌన్ కారణంగా ఈసారి నామినేషన్ల హార్డ్ కాపీలు పంపాల్సిన అవసరం లేదని, దరఖాస్తుదారుడు సంతకం చేసిన నామినేషన్ పత్రం స్కాన్ కాపీలు, సిఫార్సు చేసిన అధికారి ద్వారా వచ్చే నెల 3వ తేదీలోగా అందేట్లు పంపుకోవాలి’ అని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఈసారి అర్జున, ఖేల్రత్నఅవార్డుల కోసం 2016 జనవరి నుంచి 2019 డిసెంబర్ వరకు ఆయా క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నది.
క్రీడా పురస్కారాలకు దరఖాస్తులు పంపండి
Related tags :