Movies

కొత్త ప్రతిభ బాగుంది

Charmi Kaur Bids Farewell To Acting And Movies

హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఛార్మి. ఇప్పుడు నిర్మాత‌గా మారారు. పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి నిర్మాత‌గా మారి ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాను నిర్మించింది ఛార్మి. ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాను కూడా నిర్మిస్తోంది. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఛార్మి మాట్లాడుతూ ‘‘ఇక‌పై సినిమాల్లో నేను న‌టించ‌ను. చాలా మంది కొత్త హీరోయిన్స్ వ‌స్తున్నారు. మంచి ప్ర‌తిభ‌ను క‌న‌ప‌రుస్తున్నారు. ఈ స‌మ‌యంలో నేను న‌టిగా న‌టించాల‌నుకోవ‌డం లేదు. జ్యోతిల‌క్ష్మీ స‌మయంలో న‌టిగా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిద్దామ‌ని అనుకున్నాను. అయితే పూరి, క‌ల్యాణ్‌గారి స‌ల‌హాతో దాన్ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌లేదు’’ అన్నారు.