Movies

పూరీ చిత్రంలో బాలయ్య గురించి ఛార్మి చర్చ

Charmee Kaur Speaks About Balakrishna And Puri Jagannath

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ భవిష్యత్తులో సినిమా తీస్తారని నటి, నిర్మాత ఛార్మి అన్నారు. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరీ తర్వాతి సినిమాలు ‘ఫైటర్‌’, ‘రొమాంటిక్‌’ గురించి ముచ్చటించారు. అనంతరం బాలయ్య గురించి స్పందిస్తూ.. ‘ఆయన చాలా పాజిటివ్‌గా ఉండే వ్యక్తి. ఆయనతో సినిమా తీయడానికి పూరీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. వారిద్దరి మధ్య అంత మంచి బంధం ఉంది. బాలయ్య సినిమా అంటే మంచి కథ కావాలి. సరైన స్క్రిప్టు కుదిరినప్పుడు ఇద్దరూ కలిసి సినిమా తీస్తారు’ అని చెప్పారు. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న ఛార్మి నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించారు. ‘రోగ్‌’, ‘పైసా వసూల్‌’, ‘మెహబూబా’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.