Health

చైనా సరికొత్త వైరస్‌తో గుఱ్ఱాలు మృతి

Horses Dying Due To Virus From Zebras In China

వందల సంఖ్యలో గుర్రాలు మృతి..

ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను పట్టి పీడిస్తుంటే.. ఆ మధ్య అదేదో ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’ అనే వైరస్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో వ్యాప్తి చెందటంతో వేల పందులు మృతి చెందాయి.

అది కేవలం జంతువులకు మాత్రమే వచ్చే వైరస్ కావడంతో మనుషులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఇప్పుడు మరోసారి అదే ఆఫ్రికా నుంచి కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది.

థాయ్‌లాండ్‌ దేశంలో ఈ వైరస్ వ్యాప్తి చెంది వందలాది గుర్రాలు చనిపోతున్నాయి.

అసలు ఈ వైరస్ ఏంటి.? గబ్బిలాల నుంచి సోకిందా.? మనుషులకు కూడా సోకుతుందా.? అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ఇక థాయ్‌లాండ్‌ రాజధాని అయిన బ్యాంకాక్‌లోని ఓ గుర్రాలశాలలో ఇప్పటికే 18 గుర్రాలు ఈ వైరస్ కారణంగా మృతి చెందాయి.

చైనాకు కొన్ని జీబ్రాలను తీసుకెళ్ళేటప్పుడు.. వాటి నుంచి ఈ వైరస్ గుర్రాలకు సోకినట్లు అక్కడి వాళ్లు కనుగొన్నారు.

ఫిబ్రవరి చివరిలోనే ఈ వైరస్ బ్యాంకాక్ చుట్టుపక్కల ప్రదేశాల్లో వ్యాప్తి చెందగా.. సుమారు 500పైగా గుర్రాలు దీని వల్ల చనిపోయాయి.