Kids

మోక్షం-తెలుగు చిన్నారుల కథ

Telugu Kids Moral Stories-Moksham And Rushi

నారదుడు భూలోక ప్రయాణాన్ని ముగించుకొని దేవలోకమునకు బయలుదేరుతూ
సంధ్యా సమయం కావడం వల్లన, సంధ్యావందనం కొరకై స్నానం ఆచరించాలని ఆ వాగు లోనికి ప్రవేశిస్తూ ఉండగా కాలికి ఆ పుర్రె తగిలినది.

దాని వైపు చూస్తే ఈతల
ముల్లోకాలు దర్శి స్తుందని వ్రాసి ఉంది. ఏమిటి ఈ పొరపాటు చనిపోయి పడిపోయాన ఈ పుర్రె ముల్లోకాలను ఏలా దర్శి స్తుంది అని సందేహంతో, సంధ్యావందనము ముగించుకుని ఆ పుర్రె ను తీసుకుని, వైకుంఠం నాకు బయలుదేరడం జరిగింది.

వైకుంఠం చేరుకొని విష్ణు దేవునితో బ్రహ్మదేవుడు
వీడు ముల్లోకాలు దర్శిస్తాడని వ్రాసాడు, మరి వీడేమో చనిపోయే భూలోకంలో పడి ఉంటే పుర్రె ను నేను తీసుకు వచ్చాను ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు?

విష్ణువు చిరునవ్వు నవ్వి నారద, వ్రాత ల గురించి నాకు తెలియవు కేవలం నేను జీవులకు పోషణ బాధ్యతలు మాత్రమే చూస్తాను.

ఈ విషయాన్ని పరమేశ్వరుని అడగడం మంచిది అని సమాధానం ఇచ్చాడు. ఆ పుర్రె ను తీసుకుని నారదుడు కైలాసం లో ఉన్న
శివుని దగ్గరకు వెళ్ళాడు పరమేశ్వరుడు, ఆయువు తీరిను వారి ప్రాణాలు తీయడమే నా పని, ఇది రాసిన బ్రహ్మ ను అడగడము సమంజసం గా వుంటుంది
అని సలహా ఇచ్చాడు.

ఆ పుర్రెను తీసుకొని బ్రహ్మలోకం బయలుదేరి వెళ్ళాడు నారదుడు, వెళ్లి బ్రాహ్మ ను ప్రశ్నించగా?

ఏం నారద విధాత రాసిన రాత నే ప్రశ్నించేటి అంతటి వాడవయ్యావా? అయినా అడుగుతున్నావు కాబట్టి
నీ సందేహాలు తీర్చడం నా ధర్మం అని, నారద
ఈ పుర్రెను తీసుకుని
మొదటి ఎక్కడికి ప్రవేశించావు?
వైకుంఠం అని నారదుడు సమాధానమిచ్చాడు.

రెండవ మారు ఎక్కడి కి తీసుకుని వెళ్ళువు కైలాసం అని మళ్లీ సమాధానమిచ్చాడు నారదుడు.

మరి చివరగా ఎక్కడికి తీసుకోవచ్చు బ్రహ్మ లోకం అని సమాధానమిస్తూ… ఆశ్చర్యకరంగా తన ముఖకవళికలను మార్చుకొన్నాడు.

ఏం నారద ఇప్పుడు చెప్పు
నేను వ్రాసిన వ్రాత లో ఏదైనా దోషం ఉన్నదా?

నారదుడు తన తప్పును క్షమించమని ఆ పుర్రెను వదిలేశాడు అదే భూమిపై పడి
పగిలిపోయినది ఆ జీవికి కపాల మోక్షం లభించింది,
జీవి దేవి లో ఐక్యమైపోయింది.

ఇదంతా చూస్తున్నాను
నారదుడికి తల తిరిగినట్లు అయింది.

బ్రహ్మదేవుడు పైన జరిగిన కథ అంత యు వివరంగా చెప్పి,
ఇతడు పూర్వం ఒక మహర్షి పరిపక్వత చందని కారణంచేత ఇతడికి ఆ జన్మలో మోక్షం లభించలేదు.

ఈ జన్మలో తనకు లభించిన
డబ్బుకు కానీ, బంగారానికి కానీ, రూపవతి అయిన
యవ్వనవతి కానీ,
వ్యామోహపరుడు కాక
అన్నింటిని తున ప్రాయంగా తెజీంజి మోక్ష లోకలను పొందగలిగాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే నువ్వు ఏది కోరుకుంటే నీకు ప్రాప్తిస్తుంది. నిష్కల్మషమైన
సాధన నీ వంతు ఫలితం ఇవ్వడము నా వంతు.
నువ్వు వదిలేయడం అలవాటు చేసుకుంటే, నీకు కావలసిన అన్ని నీ వద్దకు చేర్చే బాధ్యతను భగవంతుడు తీసుకుంటాడు.ప్రతి మనిషి లోను జ్ఞానమనే దివ్య జ్యోతి పాము వలె నిద్ర అనుగుణంగా ఉంటుంది
దానిని సాధన చేత
నిద్రలేపి నట్లయితే
షడ్ చక్రాలను చేదించడం
సులభమవుతుంది, దీనిని కుండలినీ యోగం అని అంటారు. ఇది మోక్షము అనే ద్వారాన్ని తెరవడానికి, తాళంచెవి వలె పనికి వస్తుంది.