Politics

జగన్…అంతా నేనే అనుకుంటున్నాడు

Kanna Funny Critique On YS Jagan

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కామెంట్స్….

జగన్ 14 నుండి 19 వరకు గత ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిలదీశారు

గత ప్రబుత్వ తప్పులను సరి చేసి జైలుకు పంపుతానని నమ్మించాడు.

నేను ఉన్నాను నేను విన్నాను అంటూ అధికారంలోకి వచ్చారు.

నేను ఉన్నాను అనే మాట నుండి నేనే అంతా అనే వరకు వచ్చాడు.

దేవాలయాల విషయంలో బిజెపి 9నెలలుగా పోరాటాలు చేస్తుంది.

ప్రజల మనోభావాలకు విరుద్ధంగా దేవాలయాల ఆస్తులను అమ్మితే చూస్తూ ఊరుకోం

దేవాలయాల ఆస్తుల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఫిబ్రవరి29న పాలక మండలి తీర్మానం ఆమోదిస్తే ప్రోసిడింగ్స్ ఇచ్చేవరకు దాన్ని గోప్యంగా ఎందుకు ఉంచారు

నిరర్ధక ఆస్తుల పేరిట దేవాలయాల ఆస్తులను తెగనమ్మడం కుదరదని, సింహాచలం దేవస్థానం భూములను పలుచోట్ల కబ్జాకు కారణమయ్యాయని ప్రభుత్వం దేవాలయాల ఆస్తులు కాపాడాలి

ఎలాంటి భూములు అమ్మడం లేదని అనవసరంగా బిజెపి రాద్దాంతం చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడారు.

భక్తులు తమ ఆస్తులు దేవుడు పేరుతో ఉండాలనే కోరికతో ఆస్థులు ఇచ్చారు.

కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టినట్టు భూములకు నిరార్దక భూములని పేరు పెట్టారు.

ఒక్క గజం దేవుని భూమి అమ్మినా వీధి పోరాటాలు చేస్తాం.

సింహాచలం భూములను సందట్లో సడేమియా అంటూ కబ్జా చేశారు.

జాయింట్ కలెక్టర్ కు ఎండోమెంట్ అధికారాలు అప్పజెప్పడం దేవుని భూములకు రక్షణ ఉండదనే భావన ఉంది.

యదేశ్చగా దేవాదాయ భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.

రాష్ట్రంలో ఉన్న దేవాదాయ భూముల అన్యాక్రాంతం పై బిజెపి పోరాటం చేస్తుంది.

దేవాదాయ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా మంగళవారం ధర్నా చేస్తాం.

దేవాదాయ భూముల అమ్మకం పై న్యాయపోరాటం చేస్తాం.

టిడిపి ప్రభుత్వం లో చేసిన టెండర్లను రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్న ప్రభుత్వం దేవాదాయ భూములు అమ్మడం లో ఉన్న అర్దమేంటి.

ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేస్తాం.

ప్రభుత్వ తీరు చూస్తుంటే భవిష్యత్తులో దేవాలయాల భూములకు రక్షణ ఉండదనే అనుమానం కలుగుతుంది

చేతనయుతే భూములను కాపాడండి లేకపోతే దిగి వెళ్ళిపోండి.

జీవో39, టిటిడి, సింహాచలం భూముల రక్షణ కోసం అవసరమైతే వీధిపోరాటాలకు దిగుతామని హెచ్చరించారు

ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

ఈ విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ, రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్, వనమానరేంద్ర రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు