Agriculture

రోళ్లు బద్ధలుకొట్టే రోహిణి కార్తె ప్రారంభం

Rohini Karthe 2020 Begins

ఈరోజు నుంచి రోహిణి కార్తె….

రోహిణి కార్తి అంటే ఏమిటి, రోహిణి కార్తి లో ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి?

★ రోహిణి కార్తి వచ్చిందంటే వామ్మో ఎండలు.. రోహిణి కార్తి లో ఎండలకు రోకళ్లే పలుగుతాయానే నానుడి ఉంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తొలిరోజుల్లో కొద్ది కొద్దిగా పెరిగి తాపం పెరుగుతోంది. దినదిన ప్రవర్ధమానంగా సూర్యడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మామూలుగా ఉండే ఎండల వేడిని తట్టుకోలేమంటే, ఎండాకాలంలో చివరి కార్తి అయిన రోహిణి లో ఎండలు దద్దరిల్లుతాయి.

★ మరి ఈ సంవత్సరం రోహిణి కార్తి ఎలా ఉంటుందో గమనిద్దాం.

★ ఈ సంవత్సరం రోహిణి కార్తి మే 25న ప్రారంభమై జూన్ 8 వరకు ఉంటుంది.

★ రోహిణి కార్తి ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు, ఎండ తీవ్రతలు, అగ్నిప్రమాదాలు, ఉక్క పోతలు ఎక్కువగా ఉంటాయి.

★ ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావున ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

★ ఎక్కువ కుండ నీళ్లు తాగడం, మజ్జిగ, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, రాగి జావ, ఫలూదా లాంటివి ఎక్కువగా తాగడం వల్ల, ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. కొంత ఉపశమనం లభిస్తుంది.

★ మసాలా లకు సంబంధించిన ఆహార పదార్థాలు వేపుళ్లు, పచ్చళ్ళు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్థాలు తినకూడదు.

★ రోజూ రెండుపూటలా తప్పకుండా స్నానం చేయండి. అన్ని వయస్సుల వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి.

★ తెల్ల రంగు కలిగినవి తేలిక రంగులు గల కాటన్ దుస్తులు ధరిస్తే ఉష్ణ తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది.

★ చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి, బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం మంచిది.

★ ముఖ్యంగా సాటి జీవులైన పశు, పక్షాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటిని నీళ్ళు ఏర్పాటు చేయండి.

★ బాటసారులు ఎవరైనా సరే వాళ్లు అడగక పోయిన చల్లటి నీల్లిచ్చి దాహం తీర్చండి. మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరుగుతుంది.