NRI-NRT

బోధన్‌లో నాట్స్ నిత్యావసరాల పంపిణీ

NATS Groceries Delivered In Bodhan Telangana

నాట్స్ తెలంగాణలోని బోధన్‌లో నిత్యావసరాలను పంపిణీ చేసింది. బోధన్ మునిసిపాలిటీలోని పేదలు లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న కారణంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయశేఖర్ అన్నే, నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ నాయకులు కిశోర్ వీరగంధం, గోపి కృష్ణ పాతూరి, శశాంక్ కోనేరు తదితరుల సాయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 150 కుటుంబాలు లబ్ధి పొందాయి. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు తూమూ శరత్ రెడ్డి, గుమ్ముల అశోక్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ధూప్ సింగ్, గుమ్ముల శంకర్ రెడ్డి, సాయిరెడ్డి, శంకర్ రెడ్డి గుమ్ముల(డ్రెస్సెస్ ), ప్రకాష్ రెడ్డి, శివకుమార్, విశాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.