DailyDose

కరకట్టపై సీటు కోసం యువకుల ఘర్షణ-నేరవార్తలు

Telugu Crime News Roundup Today - Youth In Ananthapuram Fight For Seat On Bridge

* హిందూపురం కంటైన్మెంట్ జోన్ ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా ఎస్పీ. స్థానిక పోలీసు అధికారులతో సమావేశం…హిందూపురంలోని పరిస్థితులపై సమీక్షకంటైన్మెంట్ జోన్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై దిశానిర్ధేశం

* రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్ వద్ద ఉద్రిక్తత.నష్ట పరిహారంపై యాజమాన్యం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతుల ఆందోళన.న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదంటున్న రైతులు. సత్తెనపల్లి-పిడుగురాళ్ళ మార్గంలో స్ధంభించిన ట్రాఫిక్.

* అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.రెండు రోజులుగా గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.రచ్చ కట్టపై కూర్చునే విషయంలో ఇరు వర్గాలకు చెందిన యువకులు మధ్య తోపులాట జరిగింది.

* గొల్లల మామిడాడ పై కరోనా పంజా. మంగళవారం 18 కేసులు నమోదు. బిక్కవోలులో ఐదేళ్ళ బాలుడికీ కరోనా పాజిటివ్ గా నిర్దారణ.

* కొత్తపేట // కొత్తపేట కమ్మిరెడ్డిపాలెం నందు మేకల దొడ్డి సమీపంలో గల ఒక బిల్డింగ్ నందు నాటు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో రావులవులెం సి.ఐ వి.కృష్ణ స్థానిక ఎస్.ఐ కె.రమేష్ తన సిబ్బందితో నాటు సారా తయారీ కేంద్రంపై దాడిచేశారు.

* టిడిపి నిజనిర్దారణ కమిటీని అడ్డుకున్న పోలీసులు. సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద అడ్డుకున్న పోలీసులు. మాజీ మంత్రి జవహర్ నేతృత్వంలో దుర్గి బయులుదేరిన కమిటీ. దుర్గి మండలంలో లీడ్ క్యాప్ భూములను పరిశీంచేందుకు వెళ్తున్న కమిటీ.

* ఝార్ఖండ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు ధన్​బాద్​ జిల్లా గోవింద్​పుర్​ బర్వా ప్రాంతంలోని ఖుడియా వంతెన వద్ద అదుపు తప్పి కాలువలో పడిపోయింది.

* మేడికోండూరులో పురు కోసల బస్తాల లోడ్ లో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీ పట్టివేత. ఇటీవల వినుకొండ ఎస్సై వెంకట్రావ్ పట్టణఒ లో వ్యక్తి వద్దు గుట్కాపాకెట్లు పట్టుకొని అతన్ని అదుపులో తీసుకొన్నసంగతి తెలిసిందే.