Devotional

హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూల అమ్మకం

TTD To Sell Laddus In Hyderabad Starting Sunday

ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి హైదరాబాద్‌లో తిరుమల లడ్డూలను విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. హిమాయత్‌నగర్‌ టీటీడీ కార్యాలయంలో కౌంటర్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకుని ఒక్కొక్క లడ్డూను రూ.25 చొప్పున విక్రయిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది. హైదరాబాద్‌లో రోజుకు 60వేల లడ్డూలు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది.