NRI-NRT

విజయవాడలో హమాలీలకు ఆటా నిత్యావసరాల పంపిణీ

American Telugu Association ATA Helps Poor Labor In Vijayawada

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో విజయవాడలో పేద హమాలీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేదలకు పంపిణీ చేశారు. విజయవాడ నగర వైకాపా కార్యదర్శి బుద్ధా దివాకర్ అధ్యక్షత వహించారు. ఆటా అధ్యక్షుడు భీమిరెడ్డి పరమేశ్, మాజీ అధ్యక్షుడు అసిరెడ్డి కరుణాకర్, తదుపరి అధ్యక్షుడు భువనేశ్ బూజాలా, ట్రస్టీ సాయినాథ్‌రెడ్డి, స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు భాను స్వర్గం తదితరులు ఈ కార్యక్రమానికి చేయూతనందించారు.