NRI-NRT

బెహ్రెయిన్‌లో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం

NRI TRS Bahrain Celebrates Telangana Formation

ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ బహరేన్ అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ శుభ సందర్బంగా కోవిడ్ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితుల్లో వున్నా కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ .

కోవిడ్ -19 కరోనా నేపథ్యంలో కంపెనీ లో
సరిగా పని లేక,జీతాలు లేక తినడానికి తిండి
లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు నిత్యావసర
వస్తువులు ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ బహరేన్ అధ్వర్యంలో అందజేయడం జరిగింది.

గత కొన్ని రోజుల నుండి కోవిడ్ -19 కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే, దీని వలన ప్రజలు ఆరోగ్యపరంగానే కాకుండా, నితావసరాల పరంగా, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి ప్రభుత్వాలు అక్కడ వీలైనంత సహాయం చేస్తున్నాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్య్వక్తులు – సంస్థలు ఆపదలో ఉన్నవాళ్లకు వీలైనంత సహాయం చేస్తున్నారు, వారందరికీ కృతఙతలు తెలియజేసిన ఎన్నారై తెరాస బహరేన్ .

అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు బోలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూగల్ఫ్ నుండి తిరిగి వచ్చే పేద మరియు ఆర్థికంగా వెనుకబడిన ఎన్ఆర్ఐలకు ఉచిత ఖ్వారంటైన్ సౌకర్యాలు కల్పించిన గౌరవనీయ సిఎం కెసిఆర్ గారికి, కెటిఆర్ గారికి మా పక్షాన కృతజ్ఞతలు. తెలంగాణా రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం తో, కెసిఆర్ గారి సారథ్యం తో, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరుణంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆభివృద్ధి పనులు,సంక్షేమ కార్యక్రమాలు విజయపథం లో దూసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి గారు రైతు బంధు, భీమా, పెన్షన్స్, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ వంటి ఎన్నో జనరంజక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు అందుకే కెసిఆర్ గారి బంగారు తెలంగాణా సాధనకై అందరు తమవంతు కృషి చేయాలనీ ఆయన కోరారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దేశమే గర్వించే విధంగా ప్రజలను కరోన మహమ్మారి నుండి కంటికి రెప్పలా కాపాడుతున్నారని , కాబట్టి ప్రజలంతా వారికి సహకరించి సామాజికదూరం పాటించాలని కోరారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ గారి స్ఫూర్తి తో , మంత్రి కే.టీ.ఆర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రవాసులకు సహాయం చేస్తూ వారిలో మానసికస్థైర్యాన్ని నింపుతున్నామని తెలిపారు.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ శుభ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్షా అని తెలిపారు.

ఈకార్యక్రంలో పాల్గొన్న ఎన్నారై టీఆరెస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ , వైస్ ప్రెసిడెంట్ బొలిశెట్టి వెంకటేష్ ,జనరల్ సెక్రటరీ పుప్పాల లింబాద్రి, మగ్గిడిరాజేందర్, సెక్రటరీ చెన్నమనేని రాజేందర్ రావు , బాల్కొండ దేవన్న , ఉత్కం కిరణ్ కుమార్,ఆకుల సుధాకర్ జాయింట్ సెక్రటరీ బొలిశెట్టిప్రమోద్ , తమ్మళ్లవెంకటేష్ , కొత్తూరుసాయన్న ,కుమ్మరి రాజు కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నల్ల శంకర్,చిన్నవేన బాజన్న ,కోట నడిపి సాయన్న, ఆకుల చిన్న బుచ్చయ్య, సొన్న గంగాధర్, తప్పి చిన్న గంగారాం, మొహమ్మెద్. తదితరులు పాల్గొన్నారు.