NRI-NRT

తబ్లీగీ విదేశీయులపై పదేళ్ల నిషేధం

Indian Govt Bans Tabligee Jammat Members For 10Years

తబ్లిగీ జమాతే కార్యకలాపాల్లో భాగ స్వామ్యమైన 2550మంది విదేశీయులను పదేళ్లపాటు భారత్​లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది.

పర్యటక వీసాపై దేశంలోకి వచ్చి.. అనుమతి లేకుండా దిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్​లో జరిగిన మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి.

అందులో పాల్గొన్నవారిలో చాలా మందికి కరోనా పాజిటివ్​గా రావడం కలకలం రేపింది.

ఈ సమావేశాలే దేశంలో వైరస్ వ్యాప్తికి కేంద్రబిందువులుగా నిలిచాయి.

ఈ మేరకు తబ్లిగీ జమాతే కార్యక్రమాల్లో పాల్గొన్న.. 2550 మందికిపైగా విదేశీయులను కేంద్రం బ్లాక్ లిస్టులో పెట్టింది.

వారిని పదేళ్లపాటు దేశంలోకి రాకుండా నిషేధం విధించింది.