Kids

తులసీ మొక్క కథ ఇది

The story of tulasi in hindu mythology

తులసి కథ…..*

తులసి మొక్క ప్రతి హిందువు ఇంట్లో తప్పనిసరిగా ఉండేది. ప్రతిరోజూ పొద్దున స్త్రీలు ఆ మొక్కకి నీరు, అగరొత్తులు, పువ్వులు వేసి పూజిస్తారు. ప్రతి సాయంత్రం దీపం వెలిగించి ఆ మొక్క ముందు ఉంచుతారు. మీరెప్పుడైనా కేవలం ఈ మొక్కనే ఎందుకు ఇంత ప్రత్యేకంగా పూజిస్తారో అని అనుకున్నారా…

ఎందుకంటే, హిందువులు తులసి మొక్కను దేవతగా భావిస్తారు. విష్ణుమూర్తికి ఆమె చాలా సన్నిహితం మరియు ఏ పూజ కూడా తులసి ఆకులు లేకుండా పూర్తవ్వదు. తులసి మొక్కకి అనేక వైద్య, ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి.

ఐతే.. అసలు తులసి మొక్క కథ ఏమిటంటే…

హిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే ఒక రాక్షసుడికి అందమైన కూతురు, ఒక యువరాణి. అమె మహావిష్ణువు పరమభక్తురాలు.

పరమశివుని మూడో కన్ను లోంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధర్ ఇతడు అపారశక్తి వంతుడు. జలంధర్ అందమైన యువరాణి వృందను ప్రేమిస్తాడు.

ఐతే.. వృంద ఏమో మహావిష్ణువు పరమభక్తురాలు.. జలంధర్ ఏమో వేరే దేవుళ్ళు అంటే గిట్టనివాడు… కానీ విధి వల్ల ఇద్దరూ పెళ్ళాడతారు. నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి, పవిత్రత వల్ల అతని శక్తి మరింత పెరిగిపోయింది. పరమశివుడుని కూడా ఓడించ గలననే అంత మూర్ఖత్వం పెరిగిపోయి జలంధర్ పరమశివునే ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు.

ఈ విషయం దేవతలందరికి తెలిసి, జలంధర్ శక్తులను చూసి భయపడతారు. వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్తారు. విష్ణుమూర్తి, వృంద తన భక్తురాలు కావటంతో, ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్థంలో పడతాడు. కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు.

జలంధర్ పరమశివునితో యుద్ధంలో ఉండగా, విష్ణువు వృంద వద్దకు జలంధర్ రూపంలో వెల్తాడు. వృంద అతన్ని గుర్తుపట్టలేక అతన్ని జలంధర్ అనే భావిస్తుంది. మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. ఆమె పతివ్రత నిష్ట భగ్నం అయి, జలంధర్ బలహీనుడవుతాడు. తన తప్పు తెలుసుకుని, వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనని మాయ చేసాడని తెలిసి బాధపడుతుంది.

మహావిష్ణువు మారురూపం తెలుసుకుని, తన పవిత్రతపై జరిగిన మోసానికి వృంద మహావిష్ణువుని రాయికమ్మని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకి నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. దీని తర్వాత, జలంధర్ పరమశివుని చేతిలో హతుడవుతాడు. వృంద కృంగిపోయి, తన జీవితాన్ని కూడా ముగించాలను కుంటుంది.

వృంద చనిపోయే ముందు, విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలవబడి, తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు. అందుకే విష్ణుమూర్తికి తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదు. అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది. ఈ దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి దీవెనలందిస్తుంది…????????????1×1 gif42 B?????????????నాగరాజు రావుల ?????
?|| ఓం నమః శివాయ ||?