NRI-NRT

సింగపూర్ ప్రవాసులతో కిషన్‌రెడ్డి సమావేశం

Kishanreddy Meets With Singapore Telugu NRTs via Zoom

కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సింగపూర్ తెలుగు సమాజం(STS) సభ్యులు, ప్రతినిధులతో అంతర్జాలంలో జూమ్ ద్వారా సమావేశమయ్యారు. సింగపూర్ నుండి భారతీయులను, తెలుగువారిని స్వదేశాలకు తరలించడానికి సాయపడిన మంత్రికి వీరు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ చర్యలు, నివారణ మార్గాలు తదితరాదులపై కిషన్‌రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా ఏవియేషన్ కార్పోరేషన్ MD భరత్‌రెడ్డి, కపిల్ ఏరో ఇండియా లిమిటెడ్ వ్యవస్ధాపకులు చిన్నబాబు, STS అధ్యక్షుడు కోటిరెడ్డి, STS సంస్థ కార్యదర్శి సత్య చిర్ల తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17న సింగపూర్ నుండి ప్రత్యేక విమానం హైదరాబాద్ బయల్దేరుతుంది.
సింగపూర్ ప్రవాసులతో కిషన్‌రెడ్డి సమావేశం