Politics

తెరాస ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తెరాస ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ మహమ్మారి సామాన్య ప్రజలను, ప్రభుత్వ అధికారులనే కాక ప్రజా ప్రతినిధులను వదలడం లేదు. తాజాగా తెలంగాణలో ఓ ప్రజా ప్రతినిధికి కరోనా పాజిటివ్‌గా తేలిన తొలి కేసు నమోదైంది. టీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ అని వైద్యులు గుర్తించారు. ఆయన కరోనా లక్షణాలతో ఉండగా.. వైరస్ అనుమానంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్లు వైద్యులు ప్రకటించారు.