జేసీ ప్రభాకర్ రెడ్డికి బైపాస్ ఆపరేషన్ చేశారని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
లారీల కొనుగోళ్లలో ఏం జరిగిందో తనకు తెలియదని, కాకపోతే ఎన్ఓసీ ఇచ్చిన తరువాత ఎవరైనా వాహనాలు నడుపుకొంటారని అన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎవరు ఎదురు చెప్పినా ప్రశ్నించినా ఇలాంటి పరిస్థితే ఉంటుందన్నారు.
రేపు నన్ను అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. సీఎం జగన్ ఎవరికీ భయపడరని, ఆయన్ను కంట్రోల్ చేయగలిగేది ఒక్క చంద్రబాబు మాత్రమేనన్నారు.
దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని ప్రత్యక్ష ఆందోళన చేసినా ప్రయోజనం ఉండదని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.