Politics

అవినీతి చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే

అవినీతి చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే

ఏపీలో అచ్చెన్నాయుడి అరెస్ట్ అంశం రాజకీయపరంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను ఉపేక్షించరాదని అన్నారు. అవినీతి ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతినేతల భరతం పడతామని ఎన్నికల ముందు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు తన మాట నిలబెట్టుకోవాలని, ప్రస్తుతం ఇసుక మాఫియాకు పాల్పడుతున్న వారిపైనా కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.