Politics

వైకాపాపై చంద్రబాబు మండిపాటు

వైకాపాపై చంద్రబాబు మండిపాటు

రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఇప్పుడు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన ఆయన.. ఆ రాజ్యాంగ వ్యవస్థలనే నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నేరగాళ్లకు తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా కండువా వేసుకుంటే వందల కోట్ల రూపాయల జరిమానాలు రద్దు చేస్తున్నారని.. వైకాపాకు లొంగకపోతే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆక్షేపించారు. పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన వైకాపా తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.