Kids

సంతోష్‌బాబుకు కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు పూర్తి-చిత్రాలు

సంతోష్‌బాబుకు కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు పూర్తి-చిత్రాలు-Colonel Santosh Babu Final Rituals Completed-Gallery

సంతోష్‌బాబుకు కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు పూర్తి-చిత్రాలు.

లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ సమీపంలో భారత్‌-చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సూర్యాపేట వాసి, కర్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ డి.అర్వింద్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్‌బాబు పార్థివహాన్ని సందర్శించి నివాళులర్పించారు. స్థానికులు జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం ప్రకటించారు. సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. వేలాది మంది ప్రజలు కర్నల్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. స్థానికులు భవనాలపై నుంచి పూలు చల్లుతూ నివాళులర్పించారు. కరోనా వైరస్‌ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పురపాలిక అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సైనిక సంస్కారాల ప్రక్రియలు 16 బిహార్‌ రెజిమెట్‌ బృందం పాల్గొంది.

########################