Devotional

పూరీ రథయాత్ర జరగదు

పూరీ రథయాత్ర జరగదు

భారత్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్ర పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కరోనా వల్ల పూరీ జగన్నాథ రథయాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో లక్షలమంది తరలివచ్చే అవకాశమున్నందున రథయాత్ర సబబు కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రథయాత్రకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23 నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. తాజాగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకునే రథయాత్రను ఆపుతున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.