Politics

ప్రజలే స్వచ్ఛందంగా చైనా వస్తువులను బహిష్కరించాలి

Kishan Reddy Calls For Voluntary Ban Of Chinese Goods

వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. సంతోష్‌ బాబు కుటుంబ సభ్యులను కిషన్‌రెడ్డి సూర్యాపేటలో పరామర్శించారు. చైనా దురాగతాలకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారని కిషన్‌ రెడ్డి చెప్పారు. సంతోష్ బాబు కుటుంబానికి భారత సైన్యం అండగా ఉంటుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా చైనా వస్తువులను బహిష్కరించాలని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.