Politics

చెక్కు భూమిపత్రాలు అందజేసిన కేసీఆర్

చెక్కు భూమిపత్రాలు అందజేసిన కేసీఆర్

సూర్యాపేటలో కల్నల్ సంతోష్ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేట చేరుకున్న సీఎం
రూ.5 కోట్ల చెక్, ఇంటి స్థలం పత్రాలు, ఉద్యోగ నియామక పత్రం అందజేత
సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో కల్నల్ సంతోష్ నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేట వెళ్లిన ఆయన సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తొలుత సంతోష్ బాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆపై రూ.5 కోట్ల ఆర్థిక సాయం తాలూకు చెక్, హైదరాబాద్ కేబీఆర్ పార్కు సమీపంలో ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందించారు. అంతేకాదు, తమ ప్రభుత్వం ప్రకటించినట్టుగా సంతోష్ బాబు భార్య సంతోషిని డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందజేశారు.

సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు వీరోచితంగా పోరాడి అమరుడైన సంగతి తెలిసిందే