Devotional

కదిలిన పూరీ జగన్నాథ రథచక్రాలు

Puri Jagannath Ratha Yatra 2020 Begins || TNILIVE Spiritual News

పూరీ రథయాత్ర ఆరంభమైంది. కొవిడ్‌-19 విస్తరిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గనిర్దేశకాల ప్రకారం ఆ జగన్నాథుడి రథ చక్రాలు కదిలాయి. నేడు ప్రత్యేక పూజల తర్వాత సంప్రదాయానుసారం మధ్యాహ్నం 12 గంటలకు పూరీ మహారాజు దివ్యసింగ్‌దేబ్‌ గజపతి.. బంగారు చీపురుతో స్వామివారి రథాన్ని శుభ్రం చేసే కార్యక్రమం ‘ఛెర్రా పహన్రా’ పూర్తిచేశారు. దీనితో జగన్నాథుడు తన నందిఘోష్‌ రథంలో, బలభద్రుడు తాళ ధ్వజంలోను, సుభద్రా దేవి దర్పదళన్‌ రథంలో తరలివచ్చే రథయాత్రకు మార్గం సుగమమయింది.