Editorials

ఇందిర నియంతృత్వానికి బలైన స్నేహలతారెడ్డి

Indira Gandhi Snehalatha Reddy Story In Telugu

45 సం. ల కిందట నేడు ఎమెర్జెన్సీ విధించిన సందర్బంగా :

” స్నేహలతా రెడ్డి – ఎమెర్జెన్సీ లో రాలిపోయిన ఆపన్నుల స్నేహ హస్తం”

ఈమె భారతీయ సినీ నటి, నిర్మాత మరియు సామాజిక కార్యకర్త. ఈమె ఇంగ్లీష్, కన్నడ, నాటక రంగాలు మరియు కన్నడ సినిమా రంగాలలో రాణించారు. ఈమె సామాజిక కార్యకర్త కూడా. ఈమె తన తొలి రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటీష్ వారంటే ఈమెకు ఎంత కోపం అంటే ఆమె ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ కుటుంబంలో జన్మించినా తిరిగి పూర్తి భారతీయతను స్వీకరించి భారతీయ సంప్రదాయ దుస్తులను, బొట్టును గర్వంగా ధరించేవారు.

ఈమె పట్టాభిరామి రెడ్డి అనే రచయిత, దర్శకుడిని పెళ్లి చేసుకుంది. ఈమె సోషలిస్ట్ రాం మోహన్ లోహియా అభిమాని.

అనేక పేరున్న ఆంగ్లనాటకాలలో నటించారు. ముఖ్యంగా యు.ఆర్.అనంతమూర్తి రాసిన, ఈమె భర్త దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం “సంస్కర” లో స్నేహలత జాతీయ దృష్టికి వచ్చింది. ఈ చిత్రం 1970 లో జాతీయ అవార్డును గెలుచుకుంది.

స్నేహలత మరియు ఈమె భర్త అత్యవసర పరిస్థితి విధింపు ,నిరంకుశ ఇందిరా గాంధీ పాలనకు వ్యతిరేకంగాఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె ట్రేడ్ యూనియన్ నాయకుడు, రాజకీయవేత్త జార్జ్ ఫెర్నాండెజ్ సన్నిహితురాలు. బరోడా డైనమైట్ కేసులో ఈమెకు కూడా పాత్ర ఉంది అని చెప్పి 1976లో మే నెల 2వ తేదీన అరెస్టు చేశారు. జార్జ్ ఫెర్నాండెజ్ మరో 24 మంది నిందితుల పేర్లు తుది చార్జిషీట్‌లో ఉన్నా స్నేహలత పేరు మాత్రం పేర్కొనబడలేదు. ఆమెను కేవలం ‘”సహచారి” అని మాత్రమే పేర్కొని దోషిగా పరిగణించారు.

ఈమెను బెంగుళూరు సెంట్రల్ జైలులో ఎటువంటి విచారణ లేకుండా ఎనిమిది నెలలు నిర్బంధించారు. సాధారణ కరుడుగట్టిన నేరస్తులపై ప్రయోగించిన హింసాత్మక పద్ధతులను ఈమెపై ప్రయోగించారు. జైల్లో అతి దారుణంగా హింసకు గురయ్యారు. ఈమెకు దీర్ఘకాలంగా ఉబ్బసం ఉన్నప్పటికీ ఈమెకు సక్రమంగా చికిత్స పొందక రెండు సందర్భాలలో కోమాలోకి వెళ్ళింది . ఈమెను ఏకాంత నిర్బంధంతో ఉంచారు. దీనితో అసలే బలహీనంగా ఉన్న ఈమె ఆరోగ్యం మరింత దిగజారింది.

ఈమెను జైలులో ఉంచినా ఈమె పోరాట పటిమ తగ్గలేదు. ఆమె జైలులో ఉన్నప్పుడు స్త్రీ నిందితులను జైలుకు రాగానే అందరి ముందూ నగ్నంగా పరీక్షలకు లోను చేయడం గట్టిగా వ్యతిరేకించారు. ఈ విధానంపై మహిళా నిందితులు తిరగబడాలి అని పిలుపు ఇచ్చి చివరకు ఆ జైలులో ఈ అమానవీయమైన పద్ధతి ఆపి వేయించగలిగారు.

ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో స్నేహలత చివరికి జనవరి 15, 1977 న పెరోల్‌పై విడుదలైంది. కానీ జైల్లో ఈమె అనుభవించిన నరకం, సరి అయిన వైద్య సదుపాయాలు లభించకపోవడంతో ఆమె పెరోల్ విడుదలైన కొద్ది వారాలకే 1977 జనవరి 20 న మరణించింది. అత్యవసర పరిస్థితుల మొదటి అమరవీరులలో ఆమె ఒకరు.

బీజేపీ సీనియర్ నేత LK అద్వానీ తన జీవిత కథలో ఈమె గురించి ప్రస్తావించారు. స్నేహలత జైలు శిక్ష అనుభవిస్తున్న అదే జైలులో ఉన్న మధు దండవతే తన జ్ఞాపకాలులో వ్రాస్తూ, “నేను రాత్రి పూట నిశ్శబ్దం లో ఆమె సెల్ నుండి వచ్చే స్నేహలత యొక్క అరుపులు వినలేకపోయేవాడిని” అని.

పాతవి తవ్వకండి అంటారు. కానీ ఇటువంటి కధలు ఈ తరానికి తెలియాలి అంటే తవ్వి బయటకు తీయాలిసిందే.
లేకపోతే వీరి త్యాగాలు ఈ తరానికి తెలియకుండా మరుగున పడిపోతాయి

ఇటువంటి ఎందరో బలిదానాల వల్ల ఇందిరా నిరంకుశ పాలన పోయి మళ్లీ భారత ప్రజలకు స్వేచ్చా స్వాతంత్రాలు లభిచాయి.