Politics

రిమాండ్ పొడిగింపు

రిమాండ్ పొడిగింపు

ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు రిమాండ్‌ను అనిశా న్యాయస్థానం పొడిగించింది. వచ్చే నెల 10 వరకు అచ్చెన్నాయుడు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో అనిశా కోర్టు గతంలో ఇచ్చిన 14 రోజుల రిమాండ్‌ ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో ముగిసిన విషయం తెలిసిందే.