NRI-NRT

ప్రపంచవ్యాప్తంగా పీవీ జయంతి వేడుకలపై ఎన్నారై తెరాస సమీక్ష

ప్రపంచవ్యాప్తంగా పీవీ జయంతి వేడుకలపై ఎన్నారై తెరాస సమీక్ష

మాజీ ప్రధాని పివి నరసింహారావు శతాబ్ది జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణా ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణా వారితో, ఎన్నారై తెరాస కార్యకర్తలతో ఎన్నారై తెరాస సమన్వయకర్త మహేశ్ బిగాల మంత్రి కేటీఆర్‌తో కలిసి వీడియో కాంఫరెన్స్ నిర్వహించారు. 51 దేశల్లోని 500కు పైగా ప్రవాసులతో వీరు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ పీవీ అవలంబించిన వివిధ విప్లవాత్మక సంస్కరణలు, నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని గుర్తు చేశారు. స్థానిక ప్రభుత్వాలు అనుమతిస్తే తెలంగాణా ప్రభుత్వ ఖర్చులతో ఆయా దేశాల్లో పీవీ విగ్రహాలను ప్రతిష్టిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులుగా నియముతలైన మహేష్ బిగాలను సభికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎమ్మెల్యే మర్రి జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.