Sports

2011 ఫైనల్స్‌పై శ్రీలంక దర్యాప్తు

2011 ఫైనల్స్‌పై శ్రీలంక దర్యాప్తు

2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో తమ దేశం భారత్‌కు అమ్ముడుపోయిందని అప్పటి శ్రీ లంక క్రీడాశాఖ మంత్రి మహీందనంద ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ దేశ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. అయితే, దాన్ని క్రిమినల్‌ కేసుగా పరిగణిస్తున్నట్లు అక్కడి క్రీడా మంత్రిత్వ శాఖ సెక్రటరీ రువాన్‌చంద్ర సోమవారం మీడియాకు వెల్లడించారు. ఆ కేసులో క్రిమినల్‌ దర్యాప్తు ప్రారంభమైందని, అందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు పేర్కొన్నారు. స్థానిక మీడియా కథనం ప్రకారం లంక మాజీ సారథి, 2011 నాటి చీఫ్‌ సెలక్టర్‌ అరవింద డిసిల్వను మంగళవారం విచారించనున్నారు.