Movies

నాకు చాలా కోపం వచ్చింది

Rajinikanth On Recent Deaths - TNILIVE Movies News

తమిళనాడులో పోలీసుల అదుపులో ఉన్న తండ్రీ కొడుకులు మరణించిన ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా కొందరు పోలీసుల వ్యవహారశైలి తనను షాక్‌కు గురిచేసిందని రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారికి కఠిన శిక్ష విధించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. పి.జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, దుకాణాన్ని తెరిచి ఉంచినందుకు వారిని పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో ఉన్న వారిని పోలీసులు విచక్షణా రహితంగా కొట్టడంతో మరణించారు. ఆ చర్య తీవ్ర వివాదాస్పదమైంది. ఆ ఘటనకు పాల్పడిన పోలీసులను శిక్షించాలంటూ, ఆ తండ్రీ కొడుకులకు న్యాయం జరగాలంటూ నెటిజన్లు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో రజనీ స్పందించారు.