Movies

మొక్కలు నాటిన రేణు

Renudesai participates in green challenge and install plants

ప్రముఖ యాంకర్‌ ఉదయభాను విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను నటి, దర్శకురాలు రేణుదేశాయ్‌ స్వీకరించారు. ఇందులో భాగంగా ఆమె మొక్కలు నాటారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా యాంకర్ ఉదయభాను.. హాస్యనటుడు బ్రహ్మానందం, నటి రేణు దేశాయ్‌లకు ఛాలెంజ్‌ విసిరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్రహ్మానందం ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయగా, ఇప్పుడు రేణు దేశాయ్‌ తన కుమార్తె ఆద్యతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనీ, ఎవరికి వారు స్వయంగా నామినేట్‌ చేసుకోవాలనీ కోరారు.