Politics

కుంభకోణాలపై చంద్రబాబు ఆవేదన

Chandrababu Slams YSRCP Scams-Telugu Politics News

వైసీపీ నేతలు పేదలకు ఇళ్లు కట్టించే విషయంలో దోపిడీకి పాల్పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. స్వార్థం కోసం ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడికక్కడ కుంభకోణాలు చేస్తూ, వైసీపీ నేతలు తమ పొట్టలు పెంచుకుంటున్నారని విమర్శించారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ఇదే దృశ్యం కనిపిస్తోందని అన్నారు.