Food

జొన్నతో పాయసం చేసుకుందామా?

కావలసిన పదార్థాలు :
జొన్న పిండితో చేసిన సేమ్యా : 150 గ్రా.

బెల్లం : 100 గ్రా.

పాలు : ఒక కప్పు

యాలకుల పొడి : 10 గ్రా.

నెయ్యి : 10 గ్రా.

నీళ్లు : 2 1/2 కప్పులు

తయారీ విధానం :
జొన్న సేమ్యాను నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. వేయించిన ఆ సేమ్యాను 2 1/2కప్పుల వేడి నీటిలో ఉడికించుకోవాలి. పాలను కాచి, దానిలో యాలకుల పొడి, వేయించిన సేమ్యాను 10 నిమిషాల పాటు ఉడికించాలి. తురిమిన బెల్లాన్ని పై మిశ్రమానికి కలుపుకోవాలి. వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరించుకోవాలి.

పోషకాలు (100గ్రా.లో) :
ప్రొటీన్స్‌ : 4.98 గ్రా.

కొవ్వు : 4.9 గ్రా.

పీచు పదార్థం : 1.5 గ్రా.

పిండి పదార్థం : 27.2 గ్రా.

శక్తి : 285.5 కి.క్యాలరీస్‌

క్యాల్షియం : 68.3 మి.గ్రా.

ఇనుము : 1.5 మి.గ్రా