Politics

ముందస్తు బెయిల్‌కు పితాని

ESI Scam Update - Pitani Appeals For Anticipatory Bail To High Court

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ స్కాంలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో పాటు.. మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే.. గురువారం సాయంత్రం పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. పితాని దగ్గర అప్పట్లో పీఎస్‌గా పనిచేసిన మురళీ మోహన్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మొత్తానికి చూస్తే.. పితాని కుమారుడు సురేశ్‌ ముందస్తు బెయిల్‌కోసం హైకోర్టును ఆశ్రయించడం ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు అచ్చెన్నాయుడు సహా తొమ్మిది మందిని ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం విదితమే.